Caste Census : జాతీయ స్ధాయిలో కుల గణన చేపట్టాలనే డిమాండ్ను తెరపైకి తీసుకువచ్చిన కాంగ్రెస్లో ఇదే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిద్ధాంతపరమైన రాజకీయాలను కాంగ్రెస్ సమర్ధించడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ అధినాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుల గణన డిమాండ్తో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలను పార్టీ అగౌరవపరిచిందని తప్పుగా అర్ధం చేసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు రాసిన లేఖలో ఆనంద్ శర్మ పేర్కొన్నారు. 1980ల్లో ఇందిరా గాంధీ ఓ సందర్భంలో చేతిపై కులం ముద్ర ఉండదని చేసిన వ్యాఖ్యలు పార్టీ వైఖరికి అద్దం పడతాయని, అలాగే 1990ల్లో కులాన్ని ఎన్నికల అంశంగా మలచడాన్ని రాజీవ్ గాంధీ వ్యతిరేకించారని ఆనంద్ శర్మ గుర్తుచేశారు.
ఈ అంశంపై పార్టీ చారిత్రక వైఖరికి విరుద్ధంగా వ్యవహరించడం చాలా మంది కాంగ్రెస్ వ్యక్తులకు, మహిళలకు ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. కుల గణన డిమాండ్ ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల హయాంను అగౌరవపరుస్తోందనేది తన అభిప్రాయమని వివరించారు. కాగా, కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి అధికార పగ్గాలు చేపడితే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
Read More :
BJP’s Top Muslim Leader Joins Congress | కాంగ్రెస్లో చేరిన బీజేపీ టాప్ ముస్లిం నాయకుడు