గౌహతి: లోక్సభ ఎన్నికలకు ముందు అస్సాంలో అధికార బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ మైనార్టీ అగ్ర నాయకుడు అమీనుల్ హక్ లస్కర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. (BJP’s Top Muslim Leader Joins Congress) అస్సాం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జితేంద్ర సింగ్ అల్వార్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అస్సాంలో బీజేపీ తన రాజకీయ భావజాలాన్ని కోల్పోయిందని ఆయన ఆరోపించారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. ‘నేను 13 ఏళ్లుగా బీజేపీలో ఉన్నా. అప్పటి బీజేపీకి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఆ సమయంలో బీజేపీ మార్పు గురించి మాట్లాడేది’ అని అన్నారు.
కాగా, బీజేపీ సిద్ధాంతం ఇప్పుడు బద్రుద్దీన్ అజ్మల్కు చెందిన ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) మారిదిగా మారిందని అమీనుల్ హక్ లస్కర్ ఆరోపించారు. బీజేపీ నుంచి తాను వైదొలగడం అధికార పార్టీలో మైనారిటీ వర్గం విశ్వసనీయతను ప్రభావితం చేస్తుందని ఆయన అన్నారు.
మరోవైపు 2016లో అస్సాం బీజేపీ తొలి మైనారిటీ ఎమ్మెల్యేగా అమీనుల్ హక్ లస్కర్ గెలిచారు. అస్సాం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. అస్సాం రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్పర్సన్గా కూడా నియమితులయ్యారు. 2021లో ఏఐయూడీఎఫ్కు చెందిన కరీం ఉద్దీన్ బర్భూయా చేతిలో ఆయన ఓడిపోయారు.