పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు గుర్తుగా దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుతూ ఉండే అమర జవాన్ జ్యోతిని కేంద్ర ప్రభుత్వం ఆర్పేయనుంది. శుక్రవారం నాడు ఈ జ్యోతిని తీసుకెళ్లి యుద్ధ స్మారక జ్యోతిలో కలిపేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ అమర జవాన్ జ్యోతిని 1972లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారు. దీన్ని 2019లో మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యుద్ధ స్మారక జ్యోతిలో కేంద్ర ప్రభుత్వం కలిపేయనుంది. దీనిపై కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. నిర్వహణ కష్టతరం కావడం వల్లనే అమర జవాన్ జ్యోతిని ఆర్పేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ క్రమంలో స్పందించిన రాహుల్ గాంధీ.. ‘‘ఇది చాలా బాధాకరమైన విషయం. కొంతమంది దేశభక్తి, త్యాగాన్ని అర్థం చేసుకోలేరు’’ అని బీజేపీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే సైనికుల కోసం మరోసారి అమర్ జవాన్ జ్యోతిని వెలుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.