Rahul Gandhi : విపక్ష ఇండియా కూటమి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపడితే దేశవ్యాప్తంగా కుల గణన చేపడుతుందని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. జార్ఖండ్ సీఎం గిరిజనుడు అయినందునే జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
భారత్ జోడో యాత్రలో భాగంగా జార్ఖండ్ రాజధాని రాంచీలో షహీద్ మైదాన్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. కాషాయ పాలకుల హయాంలో దళితులు, గిరిజనులు, ఓబీసీలను నిర్బంధ కార్మికులుగా మార్చారని, బడా కంపెనీలు, ఆస్పత్రులు, స్కూళ్లు, కాలేజీలు, కోర్టుల్లో వారికి ప్రాతినిధ్యం లేదని అన్నారు.
ఇది దేశం ముందున్న అతిపెద్ద ప్రశ్నని, ముందుగా దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని అన్నారు. ప్రస్తుత చట్ట నిబంధనల ప్రకారం 50 శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వలేమని, తాము అధికారంలోకి రాగానే రిజర్వేషన్పై పరిమితిని తొలగిస్తామని హామీ ఇచ్చారు.
Read More :
Pakistan | పోలీసు స్టేషన్పై ఉగ్రమూకల దాడి.. 10 మంది పోలీసులు మృతి