న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలకు ఉపాధి హామీ పథకం బలైపోతున్నదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఉపాధి హామీ కూలీలకు ఆధార్ ఆధారిత వేతనాల చెల్లింపును తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇటీవల జారీచేసిన ఉత్తర్వులను ఆయన తప్పుబట్టారు. ఇది పేదల ఆదాయంపై దాడి అని, కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్న పేద కుటుంబాలకు అండగా ఉంటున్న ఈ విప్లవాత్మక పథకం బలైపోతున్నదని రాహుల్ పేర్కొన్నారు. అటు అదానీ-హిండెన్బర్గ్ అంశం తీవ్రమైనదని, దీంతో దేశంలో అతిపెద్ద ఆర్థిక కుంభకోణం అదానీదే అవుతుందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత భక్తచరణ్ దాస్ అన్నారు.