Priyanka Gandhi | కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్లో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రియాంక ట్విట్టర్ ద్వారా వివరించారు. తన నివాసంలో సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నానని, పోట్రోకాల్స్ పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ప్రియాంక గాంధీ కరోనా బారినపడడం ఇది రెండోసారి. ఇంతకు ముందు గత జూన్లో మహమ్మారి బారినపడ్డారు.
ఇదిలా ఉండగా.. మంగళవారం కాంగ్రెస్ రాజ్యసభపక్ష నేత మల్లికార్జున ఖర్గే సైతం కొవిడ్కు పాజిటివ్గా పరీక్షించారు. మరో వైపు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ సైతం అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆల్వార్లో సంకల్ప్ శివిర్ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉన్నది. వరుసగా కాంగ్రెస్ నేతలు కరోనా మహమ్మారి బారినపడడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.