న్యూఢిల్లీ : బొగ్గు బ్లాకుల వేలం పాలసీకి తిలోదకాలిచ్చిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దానిని అదానీకి అనుకూలంగా మార్చి వారికి లాభదాయకమైన బొగ్గు క్షేత్రాలను అప్పనంగా అప్పగించిందని కాంగ్రెస్ ఆరోపించింది. వేలం పాటలో ఒక్క అదానీ గ్రూప్ మాత్రమే ఉండటమో లేదా ఎవరైనా ఉన్నా వారు రెండో బిడ్డర్గా మాత్రమే ఉండేవారని, తద్వారా చాలా బొగ్గు గనులు అదానీకి ఏకపక్షంగా కట్టబెట్టారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆరోపించారు.