జైపూర్ : రాజస్ధాన్లో పాలక కాంగ్రెస్ పంచాయతీ సమితి ఎన్నికల్లో అత్యధిక స్ధానాలను దక్కించుకుంది. ఆరు జిల్లాల్లో మూడు దశల్లో ఎన్నికలు జరిగిన 1564 పంచాయతీ సమితిలకు గాను కాంగ్రెస్ పార్టీ 598 స్ధానాల్లో గెలుపొందగా, విపక్ష బీజేపీ 490 పంచాయతీ సమితిలను కైవసం చేసుకుంది.
శనివారం ఉదయం ఆరు జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా ఇప్పటివరకూ 1389 స్ధానాల ఫలితాలను ప్రకటించారు. ఇక ఆర్ఎల్పీ 39, బీఎస్పీ 10, ఎన్సీపీ రెండు స్ధానాల్లో గెలుపొందాయి. ఇండిపెండెంట్లు 250 పంచాయతీ సమితి స్ధానాల్లో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 64.40 శాతం పోలింగ్ నమోదైంది.