Defence Minister Rajnath Singh | భారత్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) విలీనం అవుతుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే భారత్లో విలీనం కావాలని పీఓకేలో నివసిస్తున్న ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, అది జరిగి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండియా టీవీ నిర్వహించిన ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
కశ్మీరీ ప్రజల గురించి పాకిస్థాన్ ప్రధాని షేబాజ్ షరీఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాజ్ నాథ్ సింగ్ స్పందిస్తూ.. ‘ఎప్పటికైనా వారు కశ్మీర్ పై కన్నేయగలరా.. వారి (పాక్) ఆందోళన అంతా పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించే. ఇప్పటికే పీఓకే ప్రజలందరి నుంచి భారత్లో విలీనం కావాలన్న డిమాండ్ పెరుగుతుంది కనుక దాడి చేసి ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదని ఏడాదిన్నర క్రితమే చెప్పాను’ అని అన్నారు.
`ఏ దేశంపైనా దాడి చేసేందుకు తమ ప్రభుత్వానికి లేదని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. కానీ, పాక్ ఆక్రమించుకున్న ప్రాంతం మనది అని అన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ మనది, భారత్లో పీఓకే తనంతట తాను విలీనం అవుతుందని విశ్వసిస్తున్నాను’ అని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.