అల్లాదుర్గం, ఏప్రిల్ 6 : ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ సాయాగౌడ్ అన్నారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో హార్వెస్టింగ్, రైస్ మిల్లర్ల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారుల వద్ద మోసపోవద్దని, రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామన్నారు. వరి కోత సమయంలో ఫ్యాన్ పెద్దగా పెట్టి తడి తొలగించేలా చూడాలని, ఫ్యాన్ పెట్టని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. సమావేశంలో మండల వ్యవసాయ అధికారిణి నాగమణి, ఏఈవోలు పాల్గొన్నారు.
యాసంగి కొనుగోలు ఏర్పాట్లపై సమావేశం
వరిధాన్యం కొనుగోలు కేం ద్రాల ఏర్పాటుపై ఆయా శాఖల అధికారులతో నేడు ఉదయం 11 గంటలకు సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఇన్చార్జి తహసీల్దార్ సంతోశ్కుమార్ తెలిపారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశానికి ఆయా శాఖల అధికారులు పాల్గొనాలని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ఖాళీగా స్థానిక సంస్థల ఉప ఎన్నికపై రాజకీయ నాయకులతో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. సమావేశానికి రాజకీయ పార్టీల నాయకులు హాజరు కావాలన్నారు.