కొండెక్కి కూర్చున్న కూరగాయలు
87 శాతం కుటుంబాలు సతమతం
‘లోకల్ సర్కిల్స్’ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకూ మండిపోతున్నాయి. ప్రత్యేకించి కూరగాయల ధరలు గత 30 రోజుల నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ధరల భారంతో దేశంలోని ప్రతి 10 కుటుంబాల్లో దాదాపు 9 కుటుంబాలు సతమతమవుతున్నట్టు ‘లోకల్ సర్కిల్స్’ తాజా సర్వేలో తేలింది. 311 జిల్లాల్లో జరిపిన ఈ సర్వేలో ప్రజల నుంచి 11,800 సమాధానాలు వచ్చాయి. మార్చి నుంచి క్రమంగా పెరుగుతున్న కూరగాయల ధరలతో దేశంలోని దాదాపు 87% కుటుంబాలు అల్లాడుతున్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది.
సర్వే వివరాలు ఇవీ..