న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతివారం ఏదో ఒక రూపంలో ఇంధన ధరలను పెంచుతూనే ఉన్నది. మే 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచగా, గత వారం గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్పై వడ్డించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీఎన్జీ (CNG) వంతు వచ్చింది. ఢిల్లీ ఎన్సీఆర్తోపాటు పలు ప్రాంతాల్లో ఇంద్రప్రస్త గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్) కిలో సీఎన్జీపై రూ.2 చొప్పున భారం మోపింది. దీంతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.73.61కి చేరింది.
తాజా పెంపుతో నోయిడాలో రూ.76.71, గుర్గావ్లో రూ.81.94, రేవారిలో రూ.84.07, కైతాలిలో రూ.82.27, ఫతేపూర్, కాన్పూర్లో రూ.85.40కు చేరాయి.
అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటంతో గతేడాది అక్టోబర్ నుంచి దేశీయ గ్యాస్ పంపిణీ సంస్థలు ధరలు పెంచుతూ వస్తున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో సీఎన్జీ కిలోకి రూ.2.50 పెరగగా, పైపుల్లో సరఫరా చేసే గ్యాస్ ధర రూ.4.25 అధికమయింది.