బెంగళూరు, ఆగస్టు 15: కర్ణాటకలో వచ్చే ఏడాది నుంచి ‘జాతీయ విద్యా విధానాన్ని’ (ఎన్ఈపీ)ని రద్దు చేస్తామని సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. ఎన్ఈపీ స్థానంలో కొత్త విధానాన్ని తీసుకొస్తామని వెల్లడించారు.
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో సిద్దరామయ్య మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడే నాటికి ప్రస్తుత విద్యా సంవత్సరం మొదలైందని, విద్యార్థులకు ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో హడావిడిగా ఎన్ఈపీని రద్దు చేయలేకపోయామని వివరించారు. మోదీ సర్కార్ తీసుకొచ్చిన ‘ఎన్ఈపీ’పై దేశవ్యాప్తంగా మేథావులు, విద్యార్థులు, లెక్చరర్లు, టీచర్లు వ్యతిరేకించారని గుర్తుచేశారు.