న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను జైల్లో వేధిస్తున్నారని, కేంద్రం సూచనల మేరకు ఆయన ప్రాథమిక హక్కుల కుభంగం కలిగిస్తున్నారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. కనీసం కేజ్రీవాల్ను భార్య సునీతా కేజ్రీవాల్తో మా ట్లాడటానికి కూడా అనుమతించడం లేద ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివా రం ఆయన మీడియా సమావేశంలో మా ట్లాడారు. కేజ్రీవాల్ తన భార్యతో కిటికీ ద్వారా మాట్లాడుతున్నారని తెలిపారు. కేజ్రీవాల్ను కరుడుగట్టిన నేరస్తుడి మాది రి పరిగణించటాన్ని ఆయన తప్పు పట్టా రు.
కరడు గట్టిన నేరస్తులు సైతం తమ బ్యారక్లలో సమావేశాలు నిర్వహిస్తార ని.. కానీ కేజ్రీవాల్ విషయంలో జైలు అ ధికారులు ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు. కేజ్రీవాల్ అంటే కేంద్రానికి అంత భయమెందుకు? అని ఆయన ప్ర శ్నించారు. మరోవైపు ఏప్రిల్ 14న బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ‘సంవిధాన్ బచావో.. తనషాహీ హటావో దివస్’ ను పాటిస్తామని ఆమ్ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ శనివారం తెలిపారు. ఆదివారం నాడు పార్టీ కార్యకర్తలంతా కలిసి రా జ్యాంగ పీఠికను చదివి రాజ్యాంగాన్ని కా పాడుతామని ప్రమాణం చేస్తారని రాయ్ చెప్పారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాయ్ మాట్లాడుతూ బీజేపీ నేతృత్వంలోని కేం ద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి చేస్తున్నదని ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమి అభ్యర్థులకు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించటానికి, నిరంకుశ ప్రభుత్వాన్ని అంతం చేయటానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని అభివర్ణించింది. ఆప్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడారు.