బెంగళూరు : కర్ణాటకలో నందిని, అమూల్ బ్రాండ్ల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై కీలక వ్యాఖ్యలు చేశారు. అమూల్ మైసూర్ పాక్ తయారు చేయగలదనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఇది పరోక్షంగా రాష్ట్రంలో అమూల్ రాకను అనుమతిస్తున్నట్టేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
‘అమూల్ మైసూర్ పాక్ను తయారు చేయగలిగితే, నందిని గుజరాత్ మిఠాయి శ్రీఖండ్ను తయారు చేస్తుంది’ అని అన్నారు. దీన్నిబట్టి అమూల్కు కర్ణాటక సర్కారు రెడ్ కార్పెట్ పరుస్తున్నట్టు అర్థం అవుతున్నదని, రాష్ట్రంలోని పాడి రైతుల కడుపుకొట్టేలా బొమ్మై సర్కారు పూనుకొన్నదనే విమర్శలు వస్తున్నాయి.