‘లంచం ఆఫర్’ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును స్వాగతించిన సత్యపాల్ మాలిక్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: గతంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న సమయంలో రెండు ఫైళ్ల ఆమోదానికి రూ.300 కోట్ల లంచం ఆఫర్ చేశారని చేసిన ఆరోపణలపై జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం అభ్యర్థన మేరకు సీబీఐ దర్యాప్తు ప్రారంభించడాన్ని ప్రస్తుతం మేఘాలయ గవర్నర్గా ఉన్న సత్యపాల్ మాలిక్ స్వాగతించారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగ ఆందోళనకు బహిరంగ మద్దతు పలికినందుకు ఈ కేసులో తనను టార్గెట్ చేస్తారన్న ప్రచారంపై ఆయన స్పందిస్తూ.. సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నానని, దర్యాప్తులో సహకరించేందుకు కావాల్సిన అదనపు సమాచారం ఇస్తానని, లంచం ఆఫర్ చేసిన వారి పేర్లు చెప్తానని పేర్కొన్నారు.
ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తాను భయపడేది లేదని, రైతుల కోసం గొంతెత్తుతూనే ఉంటానని స్పష్టం చేశారు. ‘నేను బెదిరిపోను, పోరాడుతాను’ అని అన్నారు. డీల్స్లో తమ ప్రమేయంపై కూడా విచారణ జరగనున్నదని వస్తున్న వార్తలను ఈ సందర్భంగా ఆయన కొట్టిపారేశారు. ఆ రెండు ఫైళ్లను తాను తిప్పిపంపానని, తనపై విచారణ ఉండబోదని పేర్కొన్నారు. లంచం ఆఫర్పై ప్రధాని మోదీకి తెలియజేసినప్పుడు, అవినీతిపై రాజీవద్దని ఆయన మద్దతు పలికారని తెలిపారు.