Safety Of Doctors | దేశవ్యాప్తంగా సంచనలం సృష్టిస్తోన్న 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. కేసును సిమోటోగా తీసుకుని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా జూనియర్, సీనియర్ డాక్టర్ల భద్రతపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆసుపత్రుల్లో (Hospitals) వైద్య సిబ్బంది భద్రతకై (Safety Of Doctors) తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదించింది.
వైద్యుల భద్రతకై జాతీయ టాస్క్ ఫోర్స్..
మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు(Supreme Court) ఇవాళ ఓ జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. డాక్టర్ల భద్రత గురించి టాస్క్ ఫోర్స్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మెడికల్ ప్రొఫెషనల్స్ ఎవరైనా సరే.. వారికి సామాజిక భద్రత కల్పించడమే ఆ టాస్క్ ఫోర్స్ ఉద్దేశంగా పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా డాక్టర్ల భద్రత గురించి ఏకాభిప్రాయాన్ని క్రియేట్ చేయాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ మేరకు టాస్క్ఫోర్స్ బృందంలోని సభ్యుల పేర్లను కూడా సుప్రీం వెల్లడించింది.
జాతీయ టాస్క్ ఫోర్స్ బృందం జాబితా: సర్జర్ వైస్ అడ్మిరల్ ఆర్ సరిన్, డాక్టర్ డీ నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ ఎం శ్రీనివాస్ , డాక్టర్ ప్రతిమా మూర్తి, డాక్టర్ గోవర్దన్ దత్ పురి, డాక్టర్ సౌమిత్ర రావత్, ప్రొఫెసర్ అనితా సక్సేనా(ఎయిమ్స్ కార్డియాలజిస్ట్), ప్రొఫెసర్ పల్లవి సప్రే (ముంబై గ్రాంట్ కాలేజీ డీన్), డాక్టర్ పద్మ శ్రీవాత్సవ్ (ఎయిమ్స్ న్యూరాలజీ) ఉన్నారు. వీరితో పాటు భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటరీ, కేంద్ర ప్రభుత్వం హోం కార్యదర్శి, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, జాతీయ మెడికల్ కమీషన్ చైర్పర్సన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్ ప్రెసిడెంట్ ఆ జాబితాలో ఉన్నారు.
Also Read..
Supreme Court | వైద్యులు వీలైనంత త్వరగా విధుల్లోకి చేరండి.. సుప్రీంకోర్టు విజ్ఞప్తి
Supreme Court: కోల్కతా ట్రైనీ డాక్టర్ రేప్.. ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు