రాయ్పూర్, జూలై 31: దేశంలోని పౌరులంతా రాజ్యాంగం తమకు ప్రసాదించిన హక్కులు, విధులను తెలుసుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం వృద్ధి సాధిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయవాద వృత్తిలో ఉన్నవారు సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా రాజ్యాంగం వారికి కల్పించిన హక్కులను విడమర్చి చెప్పాలని సూచించారు. రాయ్పూర్లోని హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో జస్టిస్ రమణ పాల్గొన్నారు. ప్రస్తుత తరం యువతీయువకులు అన్ని అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ఏకీకృత శక్తిగా మారుతున్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): మాండలికాలను నిలబెట్టిన దిట్ట రావిశాస్త్రి అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో రాచకొండ విశ్వనాథశాస్త్రి జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. రావిశాస్త్రి తన రచనల్లో ప్రజా సమస్యలతో పాటు సరిగా రాయని, అమలుకాని చట్టాలపై కూడా ప్రస్తావించారని పేర్కొన్నారు. తన రచనలతో తెలుగవారిని ప్రభావితం చేసిన గొప్ప రచయిత రావిశాస్త్రి అని ప్రశంసించారు. మోదీ వల్లే మీరు బతికున్నారు!