Loksabha Elections 2024 : నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం పదేండ్లుగా ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ. చిదంబరం దుయ్యబట్టారు. శివగంగ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో దిగిన తన కుమారుడు కార్తీ చిదంబరానికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పదేండ్ల సమయం ఓ ప్రభుత్వ పనితీరుకు సరైన సందర్భమని చిదంబరం పేర్కొన్నారు. పదేండ్ల పాలనలో మోదీ ప్రభుత్వం మనకు తీవ్ర నిరుద్యోగం, ధరల మంటను మిగిల్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.
వైఫల్యాలను మూటగట్టుకున్న మోదీ ప్రభుత్వం మనకు అవసరం లేదని అన్నారు. ఏ ప్రభుత్వం పదేండ్లకు మించి అధికారంలో ఉండకూడదని, ఆ తర్వాత మార్పు రావాలని పేర్కొన్నారు. ఆలోచనలు, విధానాలు, పాలకుల్లో మార్పు ఉండాలని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ కేవలం 420 సీట్లలో మాత్రమే పోటీ చేస్తోందని, వీటిలో తమిళనాడులో 25 సీట్లలో కాషాయ పార్టీ పోటీ చేస్తోందని చిదంబరం వివరించారు.
తమిళనాడులో అన్ని స్ధానాల్లో బీజేపీ ఓటమి పాలైతే వారు 400 స్ధానాల్లో ఎలా విజయం సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. తాము తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో క్లీన్స్వీప్ చేస్తామని, రాజస్దాన్, హరియాణ, ఢిల్లీలో గణనీయ స్ధానాల్లో విజయం సాధిస్తామని చిదంబరం చెప్పుకొచ్చారు.
Read More :
MK Stalin | మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే.. దేశం 200 ఏళ్ల వెనక్కి వెళుతుంది : సీఎం స్టాలిన్