చెన్నై: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జి.. ఓ ప్యామిలీ ఫంక్షన్కు హాజరుకావడం కోసం ఇవాళ తమిళనాడుకు వెళ్లారు. చెన్నై విమానాశ్రయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మమతాబెనర్జి.. స్టాలిన్ తనకు సోదరుడి లాంటి వాడని పేర్కొన్నారు.
ఇక్కడ ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో పాల్గొనేందుకు తాను వచ్చానని, అయితే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో సమావేశం కాకుండా తాను తిరిగి వెళ్లనని మమత తెలిపారు. తమది మర్యాదపూర్వక సమావేశమేనని, రాజకీయాలు మాట్లాడుకోబోమని చెప్పారు. ఇద్దరు రాజకీయ నాయకులు కలిస్తే రాజకీయేతర అంశాలపై కూడా చర్చిస్తారని ఆమె పేర్కొన్నారు.