Chenab Bridge : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ను జమ్మూకశ్మీర్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలోని రియాసీ జిల్లాలో చీనాబ్ బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారు. ఆ రైల్వే బ్రిడ్జ్కు చెందిన తాజా ఫోటోలను రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. కూ యాప్లో ఆ ఫోటోలను పోస్టు చేశారు. మేఘాలపై చినాబ్ బ్రిడ్జ్ ఆర్చీ ఉన్నట్లు ఆ ఫోటోకు ఆయన క్యాప్షన్ ఇచ్చారు. హిమాలయ పర్వతాలపై నిర్మిస్తున్న ఆ బ్రిడ్జ్ సుమారు 1315 మీటర్ల పొడుతు ఉంది. కశ్మీర్ వ్యాలీలో కనెక్టివిటీని పెంచేందుకు ఈ బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారు. సముద్ర మట్టానికి 359 మీటర్ల ఎత్తులో బ్రిడ్జ్ ఉంది. ఈఫిల్ టవర్ కన్నా ఇది 35 మీటర్ల ఎత్తు ఎక్కువ. ఈ బ్రిడ్జ్కు చెందిన తాజా ఫోటోలను ఎంపీ సంబిత్ పాత్ర తన కూ యాప్లో షేర్ చేశారు. విభిన్న కోణాల్లో తీసిన బ్రిడ్జ్ ఆర్క్ ఫోటోలు తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి. మేఘాల కన్నా ఎత్తులో.. పర్వతాల మధ్య ఆ బ్రిడ్జ్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది.