ఉత్తరకాశి, మార్చి 27: ఏప్రిల్ 22వ తేదీ నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం కానున్నది. చార్ధామ్లో భాగమైన యమునోత్రి ఆలయాన్ని ఏప్రిల్ 22 మధ్యాహ్నం 12.41కి తెరవనున్నట్లు యమునోత్రి ఆలయ కమిటీ కార్యదర్శి సురేశ్ ఉనియల్ తెలిపారు.
గంగోత్రి ఆలయాన్ని కూడా అదే రోజు తెరవనున్నారు. దీంతో ఈ ఏడాది చార్ధామ్ యాత్ర మొదలుకానుంది. కేదార్నాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 25న, బద్రీనాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 27న తెరవనున్నారు.