న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన చార్ధామ్ యాత్ర నేడు ప్రారంభం కానుంది. కరోనా వల్ల వాయిదాపడుతూ వస్తున్న యాత్రకు నైనిటాల్ హైకోర్టు అనుమతించింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న, కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ ఉన్నవారిని మాత్రమే యాత్రకు అనుమతించాలని షరతు విధించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కరోనా మార్గదర్శకాలు జారీ చేసింది.
హిమాలయల్లో ఉన్న గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలకు వచ్చే యాత్రికులు తప్పనిసరిగా కరోనా నియమాలను పాటించాలని స్పష్టం చేసింది. వ్యాక్సిన్తీసుకున్నట్లు సర్టిఫికెట్ను సమర్పించాలని, టీకా తీసుకోని వారు ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్టును చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులకు టీకాను తప్పనిసరి చేసింది. యాత్రసాగినన్ని రోజులు.. బద్రీనాథ్కు రోజుకు వెయ్యి మంది చొప్పున, కేదార్నాథ్కు 8 వందల మంది, గంగోత్రి 600, యమునోత్రికి 400 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.