Mamata Banerjee | కృష్ణానగర్, మార్చి 31: వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 400కు పైగా ఎంపీ సీట్లు గెల్చుకోవాలని పెట్టుకున్న లక్ష్యాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. 400 కాదు, కనీసం 200 స్థానాల్లో అయినా గెలవాలని ఆమె సవాల్ విసిరారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని మరోసారి స్పష్టం చేసిన ఆమె, సీఏఏకు దరఖాస్తు చేసిన వారిని విదేశీయులుగా పరిగణిస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దానికి దరఖాస్తు చేయవద్దంటూ హెచ్చరించారు. చట్టబద్ధంగా గుర్తించిన భారత పౌరులను విదేశీయులుగా మార్చే కుట్రే సీఏఏ అని అన్నారు.