14 రకాల ఖరీప్ పంటల ఎంఎస్పీని పెంచిన కేంద్రం
నువ్వులకు అత్యధికంగా రూ.523.. మక్కలకు రూ.92
న్యూఢిల్లీ, జూన్ 8: వరి మద్దతు ధరను కేంద్రం రూ.100 పెంచింది. తాజా పెంపుతో క్వింటాల్ వడ్ల(సాధారణ రకం) ధర రూ.2,040కు పెరిగింది. వడ్లు సహా వానకాలం సీజన్కు సంబంధించి 14 రకాల పంటల మద్దతు ధరల పెంపునకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది.
పెరిగిన ధరలు 2022-23 పంట సంవత్సరానికి వర్తిస్తాయి. అత్యధికంగా నువ్వులకు క్వింటాలుకు రూ.523 పెంచారు. మక్కలకు రూ.92 పెంచారు.