అదనపు కలెక్టర్ హరిసింగ్
పల్లెప్రగతి, శ్మశానవాటిక, డంపింగ్యార్డు, నర్సరీల పరిశీలన
శాయంపేట, ఏప్రిల్ 19 : జాతీయ ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని అదనపు కలెక్టర్(లోక్బాడీస్) హరిసింగ్ అన్నారు. తప్పనిసరిగా కూలీలు మాస్కులు ధరించాలని ఆదేశించారు. సోమవారం మండల పరిధిలోని తహార్పూర్ గ్రామంలో పల్లెప్రగతిలో చేపట్టిన పనులను ఆయన పరిశీలించారు. పోచమ్మకుంటలో చేపట్టిన ఉపాధి పనులను తనిఖీ చేశారు. కూలీలు వందలోపే ఉండడంతో సంఖ్యను పెంచాలన్నారు. కనీసం 300 మంది కూలీలు పనుల్లోకి తప్పకుండా వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒకే లొకేషన్లో ఉపాధి పనులు చేస్తున్నారేంటని ప్రశ్నించారు. మరో రెండు లొకేషన్లలో కూలీలకు పనులు కల్పించాలన్నారు. పెద్దగట్టుగుట్టకు ట్రెంచ్ పనులను కల్పించాలని సూచించారు. అనంతరం శ్మశానవాటిక, పల్లెప్రకృతి, జీపీ నర్సరీ, డంపింగ్యార్డును పరిశీలించారు. నర్సరీలో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. వానకాలం వరకు అన్ని మొక్కలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. శ్మశానవాటికను పూర్తి చేయాలని, చుట్టూ మొక్కలు నాటాలన్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్పై దృష్టి పెట్టాలని, 15 బిందెల నీళ్లు పట్టేలా గుంతలను తీయించి మొక్కలు పెంచాలన్నారు. రోడ్లపై చెత్త వేయకుండా ట్రాక్టర్లో పోసి డంపింగ్యార్డులకు తరలించాలని తెలిపారు. 45 ఏండ్లు దాటిన వారందరూ తప్పకుండా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తిరుపతి, సర్పంచ్ తాటికొండ మౌనిక, విష్ణువర్ధన్, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
సక్సెస్.. మార్స్పై ఎగిరిన నాసా హెలికాప్టర్
సమ్మర్ హీట్కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్