న్యూఢిల్లీ: లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థలు.. ఇలా అన్నింటికీ వర్తించే విధంగా ఉమ్మడి ఓటరు జాబితాను రూపొందించాలన్న అంశాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలిస్తున్నదని గురువారం రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది.
ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సమాధానమిస్తూ, ‘కామన్ ఓటర్ లిస్టు తీసుకురావాలని లా కమిషన్ 255వ నివేదిక ప్రతిపాదించింది. పార్లమెంటరీ కమిటీ ఈ అంశాన్ని అధ్యయనం చేస్తున్నది’ అని చెప్పారు.