న్యూఢిల్లీ: జాతీయ పింఛన్ విధానం(ఎన్పీఎస్) ప్రకటన వచ్చిన 2003 డిసెంబరు 22వ తేదీ కంటే ముందు విడుదలైన నియామక ప్రకటనల ద్వారా నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానానికి(ఓపీఎస్) అర్హత లభించింది.
ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. వీరికి పాత పింఛన్ విధానాన్ని ఎంపిక చేసుకునేందుకు వన్టైమ్ ఆప్షన్ ఇస్తున్నట్టు పేర్కొంది. విజ్ఞప్తులు, కోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.