బెంగళూరు, ఫిబ్రవరి 1: ఈ ఏడాది మేలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకకు కేంద్రం నిధుల వరద పారించింది. ఆ రాష్ట్రంలో చేపడుతున్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5300 కోట్ల భారీ సాయాన్ని అందించనున్నట్టు కేంద్ర బడ్జెట్లో వెల్లడించింది.
తుంగ నది నుంచి 17.40 టీఎంసీల నీళ్లను భద్ర రిజర్వాయర్కు అక్కడి నుంచి 29.90 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. తుంగ, భద్రావతి లాంటి జీవ నదులు ఉన్నప్పటికీ కర్ణాటకలోని మధ్య ప్రాంతం తరచూ కరువు బారిన పడుతుంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల స్థానికులకు ఊరట లభిస్తుందని అధికారులు చెప్పారు.