న్యూఢిల్లీ, మార్చి 5: ప్రభుత్వం మొద్దునిద్దుర వదిలి తమ పదోన్నతుల విషయం లో సత్వరమే నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో సహాయ నిరాకరణకు దిగుతామని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హెచ్చరించారు. పదోన్నతి పొందకుండానే పలువురు ఉద్యోగులు పదవీ విరమణ పొందుతున్నారని ఆరోపించారు. దీని వ ల్ల వారు పెన్షన్ రూపంలో ఆర్థికంగా చా లా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ మే రకు సోమవారం వంద మందికి పైగా సెం ట్రల్ సెక్రటేరియేట్ అధికారులు ప్రధాని, హోం, రక్షణ శాఖ తదితర ముఖ్య శాఖల కార్యాలయాలున్న రైసినా హిల్స్లో శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టారు. 2022లో ఏర్పాటైన క్యాడర్ రివ్యూ కమి టీ (సీఆర్సీ) ఇంకా తన నివేదికను సమర్పించలేదు. ఈ కమిటీకి సీఎస్ఎస్ కోసం అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ అయిన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అధికారులు నాయకత్వం వహిస్తారు.
కేంద్ర ప్రభుత్వానికి వెన్నెముకగా పేర్కొనే సీఎస్ఎస్ అధికారులతో కేంద్రం ఇలా ప్రవర్తించటం చాలా బాధాకరమని ఫోరం కార్యదర్శి డీఓపీటికి పంపిన లేఖలో పేర్కొన్నారు. భారత ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా వివిధ మం త్రిత్వ శాఖలు, విభాగాలలో మానవ వనరుల కోసం డిమాండ్ పెరిగింది. దీన్ని అం చనా వేయటానికి, తగిన సూచనలు చేయటానికి కేంద్ర ప్రభుత్వం 2022 అక్టోబర్ 27న క్యాడర్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేసింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కనీసం 20 ప్రభుత్వ శాఖ లు 2500 కంటే ఎక్కువ పోస్టుల కోసం అభ్యర్థనలు పంపాయి. సీఆర్సీ నివేదిక సమర్పించటంలో జాప్యం కారణంగా ఈ విభాగాలన్నీ సిబ్బంది కొరతతో సతమతమవుతున్నాయి.
సమస్య తీవ్రత గుర్తించి ప్రభుత్వం చర్య లు తీసుకోకపోతే సహాయ నిరాకరణ ఉ ద్యమాన్ని ప్రారంభిస్తామని ఫోరం స్పష్టం చేసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకే పనిచేస్తామని, అదనపు పనిగంటల్లో పనిచేయమని ఫోరం సభ్యులు తేల్చి చెప్పారు.