న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, హర్యానాలోని అంబాలా (Ambala) బీజేపీ ఎంపీ రతన్లాల్ కటారియా (Rattan Lal Kataria) కన్నుమూశారు. 72 ఏండ్ల కటారియా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చండీగఢ్లోని (Chandigarh) ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బీజేపీ తరఫున మూడుసార్లు ఎంపీగా గెలిచిన కటారియా.. 2019 నుంచి 2021 వరకు కేంద్ర జలశక్తి, సామాజిక న్యాయం, సాధికరత శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
రతన్లాల్ కటారియా మృతిపట్ల హర్యానా (Haryana) ముఖ్యమంత్రి మనోహర్లాల్ కట్టర్ (Manohar Lal Khattar) సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తంచేశారు. ఆయన నివాసానికి వెళ్లిన సీఎం.. కటారియా భౌతికకాయానికి నివాళులర్పించారు.
Panchkula | Haryana CM ML Khattar reached the residence of Ambala MP Rattan Lal Kataria and paid tribute to him
Ambala MP Rattan Lal Kataria passed away earlier today, he was admitted in Chandigarh PGI pic.twitter.com/BAc7AsxFQS
— ANI (@ANI) May 18, 2023