Coal Scam | కోల్స్కామ్ కేసు విచారణ నిమిత్తం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. దక్షిణ కోల్కతాలోని నివాసంలో ఆయన భార్య రుజీరా బెనర్జీని అధికారుల బృందం ప్రశిస్తున్నది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో రూ.1300కోట్ల వరకు బ్లాక్మనీ లావాదేవీలు జరిగినట్లు తేలింది. ఇందులో ఎక్కువ భాగం సొత్తు రాష్ట్రానికి చెందిన బడా వ్యక్తులకు సంబంధించి విదేశీ ఖాతాల్లో జమైంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో రూ.1300 కోట్ల నల్లధనం లావాదేవీలు జరిగినట్లు తేలింది.
ఇందులో ఎక్కువ భాగం రాష్ట్రంలోని పలుకుబడి కలిగిన వ్యక్తుల విదేశీ బ్యాంకు ఖాతాల్లో జమ అయింది. అయితే, ఈ కేసులో అభిషేక్, రుజీరాలను ఇప్పటికే అధికారులు విచారించారు. వాంగ్మూలాల్లో తేడాలుండడంతో తాజాగా మరోసారి విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బెంగాల్ బొగ్గు గనులకు సంబంధించిన వ్యవహారంలో సీబీఐ, ఈడీ చాలాకాలం నుంచి విచారణ కొనసాగిసున్నాయి. ఇందులో భాగంగా మార్చిలో ఢిల్లీలో అభిషేక్ బెనర్జీని ఈడీ ఎనిమిది గంటల పాటు ప్రశ్నించింది. మనీలాండింగ్ చట్టం కింద బెనర్జీ వాంగ్మూలాన్ని ఈడీ రికార్డు చేసింది. ఇవాళ ఎనిమిది అధికారులు సీబీఐ బృందంలో ఓ మహిళా అధికారి సైతం ఉన్నారు.
ఉదయం 11.30 గంటలకు హరీష్ ముఖర్జీ మార్గ్లోని అభిషేక్ నివాసం ‘శాంతినికేతన్’కు అధికారులు చేరుకున్నారు. అయితే, అభిషేక్ బెనర్జీ త్రిపుర పర్యటనలో ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో రుజీరాను సీబీఐ రెండోసారి ప్రశ్నిస్తున్నది. అంతకు ముందు ఫిబ్రవరిలో ప్రశ్నించింది. అయితే, సీబీఐ విచారణను రాజకీయ ప్రతికార చర్యగా టీఎంసీ అభివర్ణించింది. ‘రాజకీయ ప్రతీకారం సిగ్గుచేటు!. పార్టీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ అగర్తలా చేరుకోగానే రిమోట్ ఆపరేట్ చేసిన సీబీఐ రంగంలోకి దిగింది. బీజేపీ భయం స్పష్టం. కానీ మేం తలవంచం’ అని టీఎంసీ ట్వీట్ చేసింది.