పట్నా: ఉద్యోగాలకు భూముల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ (RJD) నేతల ఇండ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నారు. బీహార్ రాజాధిని పట్నాలోని ఆర్జేడీ ఎమ్మెల్సీ, పార్టీ కోశాధికారి సునీల్ సింగ్ నివాసాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయనతోపాటు పార్టీ ఎంపీ అహ్మద్ కరీమ్ ఇంట్లోనే సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే కేసులో లాలూ కుమార్తె మీసా భారతిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
యూపీఏ హయాంలో 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈమధ్యకాలంలో రైల్వే నియామకాల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు ఉన్నాయి. రైల్వేలోని వివిధ జోన్లలో ఉద్యోగాలు ఇప్పించినందుకుగాను అభ్యర్థుల నుంచి నామమాత్రపు ధరలకే వారి భూములు తీసుకున్నట్లు లాలూతోపాటు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, ఆయన కుమార్తెలు మీసా భారతి, హేమా యాదవ్లపై సీబీఐ కేసులు నమోదుచేసింది. ఈ కేసులో లాలూ ఓఎస్డీగా పనిచేసిన భోలా యాదవ్ను సీబీఐ గత నెల అదుపులోకి తీసుకున్నది.