న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో బస్సుల (Delhi Buses) కొనుగోలుపై సీబీఐ విచారణను ప్రారంభించింది. ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం 1,000 లో ఫ్లోర్ బస్సులను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలులో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని ఆరోపణలు రావడంతో సీబీఐ విచారణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దాంతో విచారణను ప్రారంభించిన సీబీఐ.. బస్సుల కొనుగోలుకు సంబంధించిన విషయాలను ఆరాతీస్తున్నది.
ఢిల్లీలో 1,000 లో ఫ్లోర్ బస్సులను కొనుగోలు చేసేందుకు ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) రెండు కంపెనీలతో ఒప్పందం చేసుకున్నది. ఈ బస్సుల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని బీజేపీ నాయకులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు చేశారు. సీబీఐ విచారణకు బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. టెండర్ నిబంధనలను విస్మరించి బస్సులను సరఫరా చేసే కంపెనీలకు మెయింటెనన్స్ కోసం ప్రతి సంవత్సరం రూ.350 కోట్లు చెల్లించాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించిందని బీజేపీ ఎమ్మెల్యే విజయేందర్ గుప్తా ఆరోపించారు. మెయింటెనన్స్ కోసం చెల్లింపులు మూడేండ్ల వారంటీ వ్యవధిలో చేయరాదన్న నిబంధన ఉన్నప్పటికీ అవినీకి ఆస్కారం ఉండేలా ఈ ఒప్పందం చేసుకున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణకు సహకరించాలని ట్రాన్స్పోర్ట్ విభాగం విజిలెన్స్ డైరెక్టర్కు ఏసీబీ లేఖ రాసింది. అయితే, నెలలు గడిచినా వారి నుంచి ఎలాంటి సమాధానం అందలేదు. ఇప్పుడు ఈ అవినీతిపై విచారణ సీబీఐ చేతుల్లోకి వెళ్లింది.
ఇరాన్లో కరోనా సంక్షోభం.. బ్లాక్లో వ్యాక్సిన్లు
జమ్ములో ఎన్కౌంటర్, అమరుడైన జేసీఓ
చైనా గుప్పిట్లోకి శ్రీలంక.. హంబన్తోట పోర్టు స్వాధీనం
తొలిసారి రూపాయి నాణెం ఎప్పుడు వచ్చిందో తెలుసా..?
ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా..? అయితే, ఇది మీ కోసమే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..