న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఆన్లైన్ చైల్డ్ పోర్న్ రాకెట్పై సీబీఐ పంజా విసిరింది. ఆన్లైన్ వేదికగా చిన్నారులను కొందరు లైంగికంగా వేధిస్తున్నట్టు సీబీఐ గుర్తించింది. దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 76 ప్రాంతాల్లో ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఈ అంశంపై నవంబర్ 14న 23 కేసులు నమోదు అయ్యాయి. చైల్డ్ పోర్న్ వీడియోలను సర్క్యూలేట్ చేస్తున్న 83 మంది అనుమానితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆన్లైన్లో చైల్డ్ పోర్న్ వీడియోలను పంపుతున్న వారిపై కఠిన చర్యలకు సీబీఐ చర్యలు చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే పలు వీడియోలను కూడా సీజ్ చేసింది. ఇవాళ సాయంత్రం వరకు సీబీఐ సోదాలు కొనసాగనున్నాయి. చైల్డ్ పోర్న్ వీడియోలను చూసిన, సర్క్యూలేట్ చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించినప్పటికీ, కొందరు కేటుగాళ్లు మాత్రం ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోవడం లేదు. ఈ 83 మందిపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోనుంది.