బెంగళూరు: దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఒక ఇంజినీర్, కాంట్రక్టర్పై సీబీఐ కేసు నమోదు చేసింది. వీరిద్దరూ లంచాలు తీసుకుంటున్నట్లు సీబీఐ అధికారులు అభియోగాలు మోపారు. ఈ కేసులో దక్షిణ మధ్య రైల్వే బెంగళూరు ఈఈ ఘన్శ్యామ్ ప్రధాన్తోపాటు కాంట్రాక్టర్లు ఎం. సూర్యనారాయణరెడ్డి, వి. సూర్యనారాయణరెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు.
కాంట్రాక్టర్ల నుంచి ఈఈ ఘన్శ్యామ్ ప్రధాన్ సుమారు రూ.1.29 కోట్లు లంచం తీసుకున్నట్లు సీబీఐ ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో సోమవారం నాడు మొత్తం 16 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. నంద్యాల, రంగారెడ్డి, బెంగళూరు, హుబ్లీ, సంగ్లీ తదితర ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి.