కోల్కతా : పశ్చిమ బెంగాల్ బొగ్గు కుంభకోణం కేసులో టీఎంసీ నేత వినయ్ మిశ్రా సోదరుడు వికాస్ మిశ్రాను సీబీఐ గురువారం రెస్ట్ చేసింది. ఈ కేసులో వినయ్ మిశ్రా పాత్రపై దర్యాప్తు ఏజెన్సీ విచారణ చేపట్టింది. ఇదే కేసులో ఈ ఏడాది ఏప్రిల్లో ఈడీ వికాస్ మిశ్రాను అరెస్ట్ చేయగా ఆరోగ్య కారణాలపై బెయిల్ పొందారు. 2020 నవంబర్ 27న సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీల్యాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది.
బెంగాల్ కోల్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి టీఎంసీ యువనేత వినయ్ మిశ్రా, ఆయన సోదరుడు వికాస్ మిశ్రా, ప్రధాన నిందితుడు అనూప్ మాఝీలకు చెందిన రూ 9.28 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అక్రమ కోల్ మైనింగ్ ద్వారా పోగుపడిన సొమ్ముతో నిందితులు ఆయా ఆస్తులు సమకూర్చుకున్నారని సీబీఐ, ఈడీ అధికారులు ఆరోపించారు.