బెంగళూర్ : కాంట్రాక్టర్పై దాడి చేసినందుకు గుబ్బి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్ఆర్ శ్రీనివాస్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. తనపై ఎమ్మెల్యే దాడి చేయడంతో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందానని కాంట్రాక్టర్ రవికుమార్ వెల్లడించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.
తుమకూరు జిల్లాలోని గుబ్బిలో పీడబ్ల్యూడీ కార్యాలయం ఎదుట టెండర్ రద్దుకు వ్యతిరేకంగా రవికుమార్ నిరసన చేపట్టగా పది మంది అనుచరులతో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కాంట్రాక్టర్పై దాడి చేశారు. రవికుమార్ ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్యే శ్రీనివాస్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read More :
Health Tips | వాటికి దూరంగా ఉంటే చాలు.. మైగ్రేన్కు చిట్కా చికిత్స