CAA Implements | వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు మోదీ ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ చట్టాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. తాజాగా అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (Union Home Ministry ) ఒక పోర్టల్ను ప్రారంభించింది (CAA website goes live) . భారత పౌరసత్వం ( Indian citizenship) కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా https://indiancitizenshiponline.nic.in వెబ్ పోర్టల్ను మంగళవారం అందుబాటులోకి తెచ్చింది. దీంతోపాటు CAA-2019 పేరుతో మొబైల్ యాప్ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్ దేశాల నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పిండచం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఆ దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతరుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం భారత పౌరసత్వాన్ని కల్పించనున్నారు. అయితే, 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి భారత్కు వచ్చిన ముస్లిమేతరులైన హిందువులు, క్రైస్తవులు, జైనులు, పార్సీలు, బౌద్ధులు, సిక్కులకు మాత్రమే ఇవి వర్తిస్తాయి. ఈ దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్ లైన్ ద్వారానే జరుగుతుంది.
Also Read..
CAA Implements | సీఏఏ అమలుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్
Seema Haider | సీఏఏ అమలును స్వాగతించిన పాక్ మహిళ సీమా హైదర్.. ప్రధాని మోదీపై ప్రశంసలు
Donald Trump | నేను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే.. క్యాపిటల్ హిల్ బందీలను విడిపిస్తా : ట్రంప్