జైపూర్ : సేల్స్ పెంచుకోవడం కోసం వివిధ వాహన తయారీ సంస్థలు, వాహన డీలర్లు పండుగల సీజన్లలో ఆఫర్లు పెడుతుంటారు. ఆ ఆఫర్లలో ఉచితాలు, క్యాష్ డిస్కౌంట్లు మొదలైనవి ఉంటాయి. కానీ, ఈ ఆఫర్లు ఇవ్వమని వారిపై ఎవరూ ఒత్తిడి చేయరు. సేల్స్ పెంచుకోవడం కోసం కంపెనీలే స్వచ్ఛందంగా ఇలాంటి ఆఫర్లు ఇస్తుంటాయి. కానీ తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం వాహన డీలర్ల చేత బలవంతంగా ఓ బంపర్ ఆఫర్ ( Bumper offer ) ఇప్పిస్తున్నది. మరి ఆ ఆఫర్ ఏందో తెలుసా..?
ఉచిత హెల్మెట్ ఆఫర్. ఎవరైనా బైకు కొంటే ఆ బైకును అమ్మిన డీలర్ కొన్న వ్యక్తికి ఉచితంగా హెల్మెట్ ఇవ్వాలన్నమాట. మరి ఈ ఆఫర్ ఎందుకో తెలుసా..? ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా బైకర్లే ప్రాణాలు కోల్పోతున్నారు. అందులోనూ హెల్మెట్ ధరించక తలకు బలమైన గాయాలై చనిపోయే వారే ఎక్కువగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్తగా బైక్ కొన్నవారికి ఉచితంగా ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్ ఇవ్వాలని రాష్ట్రంలోని వాహన డీలర్లు అందరికీ రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపింది. అంతేగాక ప్రభుత్వ ఆదేశాలను ప్రతి డీలర్ పాటించేలా చూడాలని అన్ని జిల్లాల డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లకు రాజస్థాన్ రవాణాశాఖ మంత్రి ప్రతాప్ సింగ్ లేఖలు రాశారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను సంఖ్యను తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వానికి డీలర్లంతా సహకరించాలని కోరింది.
ఇవి కూడా చదవండి
Chief Justice : దర్యాప్తు సంస్థల తీరుపై సీజేఐ సంచలన వ్యాఖ్యలు..!
దేశంలో 24% పెరిగిన నిరుద్యోగుల ఆత్మహత్యలు
మనవడితో కలిసి బామ్మ నాగినీ డ్యాన్స్.. వైరల్ వీడియో
Video viral : ఓ యువజంట బరితెగింపు.. రన్నింగ్ బైక్పైనే రొమాన్స్..!