న్యూఢిల్లీ: మాల్దీవుల వివా దం వేళ.. ఆ దేశానికి కేటాయిస్తున్న ఆర్థిక సాయం లో కేంద్రం కోత విధించింది. ఈసారి బడ్జెట్లో రూ.600 కోట్లు మాత్రమే కేటాయించింది. బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్, మయన్మార్, లాటిన్ అమెరికా దే లకు కూడా కేటాయింపులు తగ్గాయి.
మరోవైపు లక్షద్వీప్ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల వెల్లడించారు. నేటి అవసరాలకు అనుగుణంగా దేశంలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు లక్షద్వీప్తో సహా అన్ని ద్వీప భూభాగాల్లో పోర్టు కనెక్టివిటీ, పర్యాటక మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాల ప్రాజెక్టులను చేపడుతామని ప్రకటించారు.