లీక్.. ఈ మాట ఇప్పుడు సినిమా వాళ్ళని చాలా బాధ పెడుతుంది. ఎంతో జాగ్రత్తగా వాళ్ళు ఉన్నా కూడా ఎక్కడో ఒకచోట నుంచి లీకేజ్ సమస్య వెంటాడుతోంది. తాజాగా చిరంజీవి ఆచార్య సినిమా ఈ విషయంలోనూ ఇదే జరుగుతుంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది. కరోనా కారణంగా కొన్ని రోజుల నుంచి ఆచార్య షూటింగ్ జరగడం లేదు. పరిస్థితులు కాస్త చిక్కబడిన తర్వాత మళ్లీ షూటింగ్ మొదలు పెట్టనున్నారు చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఒక పాట సోషల్ మీడియాలో లీక్ కావడం చిత్ర యూనిట్ ను కలవరపెడుతుంది.
ఇప్పటికే ఆచార్య సినిమా నుంచి విడుదలైన లాహే లాహే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటలో చిరంజీవి డాన్స్ లు కూడా అదిరిపోయాయి. రెండో పాట కోసం అభిమానులు ఎదురు చూస్తున్న తరుణంలో ఇది లీక్ అవ్వడం కంగారు పెడుతున్న అంశం. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. సిద్ధ పాత్రలో ఈయన కనిపిస్తున్నాడు. సినిమాలో ఆయన కారెక్టర్ దాదాపు అరగంట ఉంటుంది. ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. నీలాంబరి పాత్రలో కనిపిస్తుంది పూజ. ఆచార్యలో ఇద్దరిపై ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ప్లాన్ చేసాడు కొరటాల శివ.
నీలాంబరి అంటూ సాగే ఈ పాట తాజాగా ఆన్లైన్లో లీక్ అయింది. ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇది తెలిసిన వెంటనే చిత్రయూనిట్ ఆ పాటకు సంబంధించిన లింకులను తొలగించే పనిలో బిజీ అయ్యారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆల్బమ్ పై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. లీకైన నీలాంబరి పాటను అధికారికంగా విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక సినిమా విడుదల తేదీపై ప్రస్తుతానికి సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది.
ఇవి కూడా చదవండి..
కరోనా పట్ల ఆందోళన వద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
గ్రేటర్ వరంగల్లో ఎన్నారైల ఇంటింటి ప్రచారం
కరోనాతో పూల వ్యాపారి మృతి..అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు
వరంగల్ జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు
ఖమ్మం అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం : ఎమ్మెల్సీ వాణీదేవి