చెన్నై: ప్లే గ్రౌండ్లో ఒక చిన్నపాటి మిస్సైల్ కలకలం రేపింది. కొందరు పిల్లలు క్రికెట్ ఆడేందుకు ప్లే గ్రౌండ్లోకి వెళ్లి వికెట్లను నేలలో పాతే ప్రయత్నం చేయగా నేలలో ఏదో గట్టిగా తగిలినట్లనిపించింది. వికెట్లపై బ్యాట్లతో గట్టిగా కొట్టినా అవి లోపలికి దిగకపోవడంతో బండరాయి ఉందేమోనని తవ్వి చూశారు. అయితే, నేలలో ఉన్నది బండరాయి కాదు, ఒక చిన్నపాటి మిస్సైల్ అని తెలిసి షాక్కు గురయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని పెరియపాలయం ఏరియాలో ఈ నెల 7న ఈ ఘటన జరిగింది.
అయితే, ప్లే గ్రౌండ్లో తేలికపాటి మిస్సైల్ బయటపడిందనే విషయం స్థానికంగా కలకలం రేపింది. పేలకుండా మిగిలిపోయిన ఆ మిస్సైల్ పేలితే ప్రమాదమని ఆందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాంబ్ స్క్వాడ్కు సమాచారం ఇచ్చారు. బాంబ్ స్క్వాడ్ దాన్ని పరిశీలించి ఫైరింగ్ సమయంలో ఈ మిస్సైల్ పేలకుండా మిగిలిపోయిందని, జాగ్రత్త హ్యాండిల్ చేయకపోతే పేలిపోయే ప్రమాదం ఉందని చెప్పారు.
అందుకే నిపుణులను పిలిపించి ఆ మిస్సైల్ను వారికి హ్యాండోవర్ చేశారు. వాళ్లు దాన్ని పరిశీలించి జాగ్రత్తగా ధ్వంసం చేస్తారని పోలీసులు చెప్పారు. ఆ మిస్సైల్ ఒక అడుగు పొడవు, 8 కిలోల బరువు ఉన్నదని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
రాష్ట్రంలో కొత్తగా 2909 కరోనా కేసులు
ఈ రోగాలుంటే డ్రై ఫ్రూట్స్ తినాల్సిందే !
కొవిడ్ వ్యాక్సిన్కు బదులుగా యాంటీ రాబిస్ డోసులిచ్చారు..
పెట్టుబడులకు కేరాఫ్ హైదరాబాద్