లక్నో: ఒక బాలుడు తన కుటుంబానికి చెందిన పొలంలో పుచ్చకాయలు కోశాడు. అయితే ఆ పొలాన్ని కౌలుకు తీసుకున్న వ్యక్తులు కత్తితో పొడిచి అతడ్ని హత్య చేశారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులను మోహరించారు. (Boy Killed For Plucking Watermelons) ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో ఈ దారుణం జరిగింది. జగ్నేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోని ఖేడా గ్రామానికి చెందిన ఒక కుటుంబం తమ పొలాన్ని కౌలుకు ఇచ్చారు.
కాగా, మే 1న ఆ కుటుంబానికి చెందిన 13 ఏళ్ల అవనీష్ కుష్వాహా సొంత పొలానికి వెళ్లాడు. ఆ పొలంలోని పుచ్చకాయలను కోశాడు. ఆగ్రహించిన కౌలుదారులు కత్తితో పొడిచి ఆ బాలుడ్ని చంపారు. సోదరుడి కోసం వెతుకుతూ వచ్చిన సోదరి అతడి మృతదేహాన్ని చూసి షాక్ అయ్యింది. తన కుటుంబానికి ఈ విషయం చెప్పింది. ఆ కుటుంబం ఆగ్రహంతో రగిలిపోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. నిందితులైన రియాజుద్దీన్, షిరాజుద్దీన్ను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పలు పోలీస్ స్టేషన్ల నుంచి అదనపు పోలీస్ బలగాలను రప్పించి అక్కడ మోహరించినట్లు వెల్లడించారు.
Also Read:
siblings found murdered | ఇటుకలతో కొట్టి నలుగురు పిల్లల దారుణ హత్య.. పరారీలో తల్లి
Watch: స్కూటీని ఢీకొట్టిన కారు.. ఫ్లైఓవర్ పైనుంచి పడి డెలివరీ ఏజెంట్ మృతి