బ్రిటన్ పరిశోధకుల అధ్యయనం
లండన్: ఒమిక్రాన్తో దవాఖాన పాలయ్యే ముప్పు నుంచి కొవిడ్ వ్యాక్సిన్ మూడో డోసు 88 శాతం మేర రక్షణ కల్పిస్తుందని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత దాని ప్రభావం 52 శాతం మేర తగ్గినట్లు తేలిందని పరిశోధనల్లో పాలుపంచుకున్న ఎరిక్ టొపోల్ వివరించారు. అయితే బూస్టర్ డోసు వేసుకుంటే వైరస్ సోకినా కానీ తీవ్రత ఎక్కువై దవాఖానలో చేరే అవకాశాలు తగ్గు ముఖం పడుతాయని తెలిపారు.