Nawab Malik | మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్కు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ నిరాకరించింది. గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులకు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2022 ఫిబ్రవరిలో ఆయనను అరెస్టు చేసింది. ఆ తర్వాత ఎన్సీపీ నేతను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆయన దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితోపాటు పలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ బాంబే హైకోర్టులో బెయిల్ కోసం దాఖలు చేశారు. అయితే జస్టిస్ అనూజా ప్రభుదేశాయ్ బెంచ్ బెయిల్ను తోసిపుచ్చింది. బెయిల్పై దాఖలైన పిటిషన్ను రెండు వారాల తర్వాత విచారణ చేపడుతామని కోర్టు పేర్కొంది. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారుతోందని, ప్రస్తుతం కిడ్నీ వ్యాధి రెండు, మూడో దశలో ఉన్నాడని.. ఈ పరిస్థితుల్లోనే ఉంచితే ప్రాణాంతకంగా మారుతుందని ఆయన తరఫున న్యాయవాది కోర్టును కోరారు.