ముంబై : ఆర్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్పై బాంబు దాడికి పాల్పడతామని హెచ్చరిస్తూ ఆర్బీఐకి సోమవారం బెదిరింపు మెయిల్ (Bomb Threat) వచ్చింది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రాజీనామా చేయాలని బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి డిమాండ్ చేశాడని ముంబై పోలీసులు వెల్లడించారు.
మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముంబైలోని 11 ప్రదేశాల్లో 11 బాంబు దాడులు జరుగుతాయని బెదిరింపు మెయిల్ హెచ్చరించింది. మెయిల్లో ప్రస్తావించిన ప్రాంతాలకు తాము విచారించేందుకు వెళ్లామని, అయితే అక్కడ ఎలాంటి అనుమానిత పదార్ధాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.
బెదిరింపు మెయిల్ ఖిలాఫత్.ఇండియా@జీమెయిల్.కాం అనే ఐడీ నుంచి వచ్చింది. ముంబైలోని ఎంఆర్ఏ మార్గ్ పోలీస్ స్టేషన్లో ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :