న్యూఢిల్లీ : రాష్ట్రాల నుంచి బాయిల్డ్ రైస్ సేకరించేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి పునరుద్ఘాటించింది. లోక్సభలో ఎంపీ దుష్వంత్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
అవసరాల రీత్యా రాష్ట్రాలే బాయిల్డ్ రైస్ సేకరించుకోవాలని సూచించారు. కేంద్రం తరపున మాత్రం సేకరించేది లేదని స్పష్టం చేశారు. ఇకపై బాయిల్డ్ రైస్ సేకరించబోమని గత ఖరీఫ్లోనే చెప్పామని గుర్తు చేశారు. 2020-21 ఖరీఫ్లో 47.49 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ను, 6.33 లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్నుసేకరించామని సాధ్వి నిరంజన్ జ్యోతి తెలిపారు.