Encounter : ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు చెందిన మరికొన్ని మృతదేహాలు లభ్యమయ్యాయి. ముందుగా 18 మంది మరణించినట్లుగా వెల్లడించిన పోలీసులు.. మరో 11 మృతదేహాలు లభ్యం కావడంతో మృతుల సంఖ్య 29కి చేరినట్లు ప్రకటించారు. కాంకేర్ జిల్లా కల్పర్ అడవిలో భద్రతాబలగాలకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. తూటాల వర్షం కురుస్తోంది.
ఈ ఎన్కౌంటర్లో ఇప్పటికే 29 మంది మావోయిస్టులు మృతి చెందగా.. ఎదురుకాల్పుల్లో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. చోటి బిటీయా పోలీసు స్టేషన్ పరిధిలోని కల్పర్ అడవిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఘటనా ప్రాంతంలో పోలీసులు ఏకే47 తుపాకులు, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.