న్యూఢిల్లీ : 2018 లైంగిక దాడి కేసులో బీజేపీ నేత షానవాజ్ హుసేన్పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఢిల్లీ హైకోర్టు పోలీసులు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ షానవాజ్ హుసేన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎఫ్ఐఆర్ నమోదైతే తమ పిటిషన్ చెల్లుబాటు కాదని, షానవాజ్ హుసేన్కు 30 ఏండ్ల రాజకీయ అనుభవం ఉందని, దీంతో ఆయన ప్రతిష్ట దెబ్బతింటుందని హుసేన్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
ఈ వ్యవహారంపై వచ్చే వారం సుప్రీంకోర్టు విచారణ చేపడుతుందని సీజేఐ స్పష్టం చేశారు. అంతకుముందు షానవాజ్ హుసేన్ అభ్యర్ధనను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు 2018 లైంగిక దాడి కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
వాస్తవాలను పరిశీలించిన మీదట ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు విముఖత చూపినట్టు స్పష్టమవుతోందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఢిల్లీకి చెందిన మహిళ జనవరి 2018లో హుసేన్పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని కోరుతూ దిగువ కోర్టులో పిటిషన్ వేశారు. బీజేపీ నేత హుసేన్ తనపై లైంగిక దాడికి పాల్పడి తనను చంపుతానని బెదిరించాడని ఆమె ఆరోపిస్తున్నారు.